YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ట్రిబ్యునల్ కు బీజేపీ

ట్రిబ్యునల్ కు బీజేపీ

జీహెచ్ఎంసీలో నేరేడ్మెట్ ఎన్నికల ఉత్కంఠకు తెర పడింది. నెరేడ్ మెట్ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితంపై హై కోర్టు తీర్పు వెల్లడించింది. స్వస్తిక్ గుర్తు బదులు మరొక గుర్తు వచ్చిన ఓట్లను లెక్కించారంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ బిజెపి నేతలు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు పూర్తి అయితే తర్వాత హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను సిపుచ్చింది.నేరేడ్ మెట్ డీవిజన్ ఫలితం వెల్లడికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించ వచ్చునని హైకోర్టు సూచించింది.ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ ఉన్నట్లుగా తేలింది. లెక్కించాల్సిన ఇతరముద్ర ఓట్లు 544 ఉన్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.

Related Posts