YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి వరుస తలనొప్పులు

 టీడీపీకి వరుస తలనొప్పులు

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామలు చూస్తుంటే విశ్వసనీయత ముఖ్య భూమిక భవిష్యత్ లోనూ పోషించనుంది. ఇప్పుడు నాయకుల విశ్వసనీయతపైనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు విశ్వసనీయత లేని నేతగా మిగిలిపోయారు కాబట్టి. చంద్రబాబు చెప్పే మాటలను జనం నమ్మరు కాని, జగన్ పాలనపై జనం వారంతట వారే విసుగు చెందితే తప్ప అది చంద్రబాబుకు అడ్వాంటేజీ కాదన్నది వాస్తవం.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరీనీ కేర్ చేయలేదు. ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోలేదు. సొంత పార్టీ నేతలనే దగ్గరకు తీయలేదు. తాను శాశ్వత సీఎంగా ఉండిపోతారని భావించారు. అధికారులు ఇచ్చిన కాకి లెక్కలను రోజూ చూసుకుంటూ మురిసిపోయే చంద్రబాబుకు ఏపీ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఫలితాల తర్వాత గాని చంద్రబాబుకు తన పరిస్థితి ఏంటో తెలియలేదు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఎప్పడు ప్రమాణం చేయాలని కూడా ముహూర్తాలు పెట్టించుకుంటూ చంద్రబాబు కాలం గడిపేశారంటారు.చంద్రబాబు ఏ మాట చెప్పినా దానిపై నమ్మకం లేకుండా చేసుకున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన డ్రామాలను ఏపీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తాత్కాలికంగా ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు చివరి నిమిషంలో ఇచ్చిన పసుపుకుంకుమ కూడా చంద్రబాబును ఆదుకోలేదు. అంటే చంద్రబాబును పదిహేను నెలల క్రితమే జనం నమ్మడం మానేశారని అర్థమయిందిగా?ఇప్పుడు జగన్ ను ఫేక్ సీఎం అన్నా, నేరగాడు అని చెప్పినా, రాష్ట్రం అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయిందని చంద్రబాబు రోజూ చెప్పినా ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్మే పరిస్థితిలేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఏపీలో విశ్వసనీయత లేదు. జగన్ తాను చెప్పిన మాట మీద నిలబడతారన్న నమ్మకం మాత్రం ఇప్పటికైతే ఉంది. అయితే రానున్న రోజుల్లో జగన్ పాలనపై విసుగు చెంది ప్రజలు బాబు వైపు మొగ్గు చూపాలే తప్ప, చంద్రబాబు చెప్పే మాటలకు మాత్రం విలువలేదన్నది మాత్రం వాస్తవం.

ఆశలు అడియాశలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవి పోతుందని అంచనా వేసుకున్నారు. న్యాయవ్యవస్థతో పెట్టుకోవడంతో జగన్ తనంతట తాను ముప్పును కొని తెచ్చుకున్నారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఇక టీడీపీ నేతలయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ ను పదవి నుంచి తొలిగించే వీలుందని ఆనందపడ్డారు. ఢిల్లీకి వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కేసును ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరి ఆశలన్నీ అడియాసలుగానే మారాయి.వైఎస్ జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ సంచలనం కల్గించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, న్యాయవ్యవస్థను కూడా శాసించడానికే ఈ లేఖ రాశారని టీడీపీ పదే పదే ఆరోపించింది. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలయితే వెంటనే జగన్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అప్పుడే న్యాయం పదికాలాల పాటు ఉంటుందని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులను రంగంలోకి దించింది. తమిళనాడుకు చెందిన మణి, మరో న్యాయవాది సునీల్ సింగ్ లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు లేఖను బహిర్గతం చేయడంపై వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటీషన్ లలో కోరారు. నిజానికి ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటీషన్లను తోసిపుచ్చడంతో టీడీపీ ఆశలు ఆవిరయిపోయాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ ను పదవి నుంచి తొలగించే పిటీషన్ కు అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్ కు ఎదురుదెబ్బ తగులుతుందని టీడీపీ భావించింది. అయితే అలా జరగకపోవడంతో ఈ కేసులో జగన్ దూకుడు మరింత పెంచుతారని భావిస్తున్నారు. ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయం కోసం ఎదురు చూడటం తప్ప టీడీపీ నేతలు చేయగలిగిందేమీ లేదు.

Related Posts