YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం టీడీపీలో వర్గపోరు

విజయనగరం టీడీపీలో వర్గపోరు

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి నేతల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని స్వంతంగా పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కె.ఎ నాయుడుతో పాటు పలువురు కార్పొరేట్ అభ్యర్ధులు,ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఏ సమాచారం కూడా తమకు అందకపోవటం,జిల్లా కేంద్రంలో జండా ఉనికి కోల్పోతున్నందు వలనే కార్యాలయం ఏర్పాటు చేశామని మీసాల గీత స్పష్టం చేశారు. మరోవైపు అధిష్టానం ఆదేశించిన పలు కార్యక్రమాలు తమ వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నామని, ఐతే ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తమకు ఏ విధమైన పార్టీ సమాచారం అందించటం లేదని ఆమె పరోక్షంగా అశోగజపతిరాజుని మర్శించారు. ప్రజా బలమున్న పార్టీకి జిల్లా కేంద్రంలో కార్యాలయం లేకపోవటంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,నియోజకవర్గంలో సైకిల్ ని ఇక పరుగులు పెట్టించేందుకే అశోక్ బంగ్లా గీత దాటుతున్నట్లు మీసాల గీత స్పష్టం చేశారు.

Related Posts