YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

శ్యామల ఎవరో నాకు తెలియదు : మంత్రి

శ్యామల ఎవరో నాకు తెలియదు : మంత్రి

భూ కబ్జా విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదని అన్నారు. ఫిర్యాదు చేసిన మహిళ శ్యామల ఎవరో తనకు తెలియదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భూమి పక్కనే ఆమె భూమి కూడా ఉందని మంత్రి అన్నారు. ‘‘ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ఇప్పటిదాకా నన్ను కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే’’ అని మంత్రి స్పందించారు. భూ వివాదంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌లో శ్యామలా దేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది.

Related Posts