YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విపక్షం బురద చల్లుతోంది

విపక్షం బురద చల్లుతోంది

తిరుమల శ్రీవారిని  వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం  దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో ఒక్క అడుగు ముందుకు వెయ్యనియ్యకుండా ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ప్రతి పక్షానికి కావాల్సింది ప్రజల క్షేమం కాదు. వారి క్షేమం. అన్ని రంగాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఏపీలో సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి జగన్. ఏలూరు వింతవ్యాధిపై ప్రభుత్వం అలసత్వం వహించదు. అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతుందని అన్నారు.

ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అతిసారతో గుంటూరులో 16 మంది,రంపచోడవరంలో మరో 15 మంది మరణించారు. ఆరోజు మాట్లాడని చంద్రబాబు ఈ రోజు మాట్లాడుతున్నారు. 24 గంటలు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నంలో ప్రతి పక్షం ఉందని అన్నారు.

Related Posts