తెలంగాణ ఎమ్మెల్సీ పూర్ణం సతీష్ కుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయి. దుష్ట శక్తులనుండి తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాలని స్వామిని ప్రార్ధించాను. . తెలంగాణలో అన్నీమతాలు వారు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కొన్ని మత తత్వశక్తులు మతఛాందస్తాన్ని నరనరాల్లోకి ఎక్కించుకొని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
టీ.ఆర్.ఏస్ అనేది ఓ మహాశక్తి ...ఎన్ని దుష్ట శక్తులు ఏకమైనా దాన్ని విచ్ఛిన్నం చెయ్యలేరు. భాజపా నాయకులు అల్పసంతోషంతో ఉన్నారు...ఈ విజయం శాశ్వతం కాదు. తెలంగాణ ప్రజల పార్టీ,తెలంగాణ ఇంటి పార్టీ ఒక్కటే అది టీ.ఆర్.ఏస్ మాత్రమేనని అన్నారు.