YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డి పందాలు జూదరుల పై పోలీసుల దాడులు

డి పందాలు జూదరుల పై పోలీసుల దాడులు

నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ ప్రాంతంలోని తాళ్లపాలెం, కోట అడవి గ్రామాలలో కోడిపందాలు జరుగుతున్నట్లు సమాచారంతో, రూరల్ పోలీసులతో, శిక్షణలో ఉన్న ఐపిఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడిపందాలు ఆడుతున్న ప్రాంతాలలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 27  ద్విచక్ర వాహనాలు, 10 పందెం కోళ్ళు, 10 సెల్ ఫోన్లు, 40 వేల 300 వందల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ లో ఉన్న ఐపీఎస్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ తాళ్లపాలెం ఏం మరియు కోట అడవి గ్రామాలలో కోడిపందాలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కోడి పందాలు ఆడుతున్న 10 మంది పందెం ఆడుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts