తెలంగాణలో బిజెపి కి కి ఆదరణ లేదు అన్న వాళ్ళకి గ్రేటర్ ప్రజలు కళ్లు తెరిపించాలని రాబోయే రోజుల్లో బిజెపి తెలుగు లేని పార్టీ ఎదుగుతుందని ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మల్కాజ్గిరి సర్కిల్ వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన బిజెపి అభ్యర్థి క్యాసం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా డాక్టర్ లక్ష్మణ్ ముషీరాబాద్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో లో ఇ పుష్పగుచ్ఛాలు అందించి మిఠాయిలు తినిపించారు. అనంతరం వారు కార్పొరేటర్ ను ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, మల్కాజ్గిరి సర్కిల్ లో బిజెపిని మరింత బలోపేతం చేయాలని కార్పొరేటర్ కు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని హలో సలహాలు సూచనలు అందించినట్లు కార్పోరేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు నరసింహ గౌడ్, ఓం ప్రకాష్, సర్వేశ్ యాదవ్, మాంగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.