YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

నాకు పీసీసీ చాలు…ఇంకేమీ ఆశించాను - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నాకు పీసీసీ చాలు…ఇంకేమీ ఆశించాను - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు పీసీసీ ఛీఫ్ పదవి ఇస్తే చాలని వ్యాఖ్యానించారు.   తనకు సీఎం, మంత్రి పదవులొద్దని స్పష్టం చేసారు. ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. దానికి నైతిక నికి బాధ్యత వహిస్తూ  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసారు.  తరువాత టీపీసీసీ ఛీఫ్ పదవి కోసం పార్టీ కసరత్తు ప్రారంభించింది.  ఈ నేపధ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ లో వివిధ వర్గాలను, నేతలను కలుస్తున్నారు. రేసులో వున్న కొమటిరెడ్డి తనకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

Related Posts