బీజేపీ పార్టీ తరపున గెలుపొందిన కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ లో బాగా పని చేస్తే, రానున్న రోజులల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కాయమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రా రావు అన్నారు..మోండా మార్కెట్ 150 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక గెలుపొందిన సందర్భంగా మార్కెట్ పంచ ముఖి హనుమాన్ ఆలయం నుండి విజయోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరైయ్యారు..బీజేపీ పార్టీ తరపున గెలుపొందిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రారావు..48 స్థానాలను గెలిపించి గ్రేటర్ లో బీజేపీ ని రెండవ స్థానంలో నిలిపి మజిలీస్ పార్టీని మూడో స్థానానానికి పంపిన నగర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు..ఇంకొన్ని సీట్లు గెలిస్తే మేయర్ పీఠం బీజేపీ దే ఉంటుండే అన్నారు..రానున్న పట్టభద్రుల సిట్టింగ్ సిట్ తోపాటు ఖమ్మం,వరంగల్,నల్గొండ ఎమ్మెల్సీ సీట్ ను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని రామచంద్రారావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మోండా డివిజన్ ప్రజలకు,బీజేపీ నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ కొంతం దీపిక మోడీ,అమిత్ షా, కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో అనుక్షణం ప్రజలల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు..