YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఓరుగల్లులో కాషాయం జెండా ఎగరాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఓరుగల్లులో కాషాయం జెండా ఎగరాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హన్మకొండ న్యూశాయంపేట టీవీర్ గార్డెన్స్ లో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గోన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రావు పద్మా, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ మంత్రి విజయరామరవు, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాకేష్ రెడ్డి.. కార్యకర్తలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ  దేశంలో ఒక్కరోజు సెలవు లేకుండా మోడీ పాలన చేస్తుంటే .. రాష్ట్రంలో ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ కు రాకుండా పాలిస్తున్నారు.  అక్కడ అవినీతి కి అవకాశం లేకుండా మోడీ పాలిస్తున్నారు.  ఇక్కడ వేళా కోట్ల అవినీతి తో సీఎం కేసీఆర్ పాలిస్తున్నారు.  వరంగల్ నగరాన్ని సర్వతోముకాభివృద్ది కోసం మోడీ పథకాలు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వరంగల్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.  హైదరాబాద్ ఆదరబాధరగా ఎన్నికలు పెట్టిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు.  హైదరాబాద్ లో మజ్లీస్ లేకపోతే టిఆర్ ఎస్ కు పుట్టగతులు లేవు. టిఆర్ ఎస్, మజ్లీస్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.  మొదటి అడుగు దుబ్బాక , రెండవ అడుగు హైదరాబాద్ వేశారు. మూడవ అడుగు వరంగల్ ప్రజలు వెయ్యాలన అన్నారు.
వరంగల్ లో కూడా కాషాయం జెండా ఎగరాలి. కేసీఆర్, కేటీఆర్, ఒవైసీ బట్టలు ఇప్పుకొని తిరిగిన 2023 లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. 2023 లో బీజేపీ రావాలని తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, యువత, మహిళలు కోరుకుంటున్నరని అన్నారు.
తెలంగాణ లో తండ్రీకొడుకుల కుటుంబ పాలన పోవాలి. ప్రజాస్వామ్య పాలన రావాలి. ఓరుగల్లు చైతన్యవంతం అయిన ప్రాంతం.. రజాకర్లను తరిమికొట్టిన గడ్డ, తెలంగాణ ఉద్యమమంలో పోరాట స్పోర్తిని చాటిన నెల అని అయనఅన్నారు.
టిఆర్ ఎస్ పై బీజేపీ కార్యకర్తలు ఏ రకమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ రాక్షస పాలనపై బీజేపీ పోరాడుతుంది.. ఇక్కడ కూడా అలాగే పని చేయాలని కోరుతున్న. వరంగల్ లో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ బీజేపీ లో పటిష్టంగా పని చేయాలి.. కార్యకర్తలే బీజేపీ పార్టీకి ఆయువు పట్టని అయన అన్నారు.

Related Posts