YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

సుప్రీం కోర్టుకు రైతులు

సుప్రీం కోర్టుకు రైతులు

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను స‌వాలు చేస్తూ భార‌తీయ కిసాన్ యూనియ‌న్ శుక్ర‌వారం సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కింది. ఈ కొత్త చ‌ట్టాల వ‌ల్ల రైతులు కార్పొరేట్ల‌కు బ‌ల‌వుతార‌ని రైతులు త‌మ పిటిష‌న్‌లో వాదించారు. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రెండు వారాలుగా దేశ రాజ‌ధానిలో పంజాబ్‌, హ‌ర్యానా రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంతో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా.. ఫ‌లితం లేకుండా పోయింది. తాజాగా కేంద్రం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కూడా రైతులు తిర‌స్క‌రించారు. ఈ చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ.. డిసెంబ‌ర్ 14న దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

Related Posts