ఖమ్మం కార్పొరేషన్పై మరోమారు గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్ పార్టీదేనని, త్వరలో జరుగనున్న కొర్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్టీ ఆఫీస్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థని చెప్పారు. విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకోసం పార్టీలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారని, ప్రజల్లో ఆదరణ ఉన్నవారితోపాటు గెలిచేవారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు.ప్రతి నాలుగైదు డివిజన్లకు ముఖ్యనాయకుడిని ఇన్చార్జిగా నియమిస్తామన్నారు. ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నేతలు కమల్రాజ్, తాతా మధు, కొండబాలకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలవడం తమకే సాధ్యమైందని, ఇప్పుడు కూడా తామే గెలుస్తామని చెప్పారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో సమావేశ మందిరాన్ని మంత్రి ప్రారంభించారు.