కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేసేందుకు రైతులు నిర్ణయించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని సరిహద్దుల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. నిరసన కార్యక్రమాల వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఏయే మార్గాల్లో ప్రయాణించవచ్చునో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.