YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏఎస్సై పై వ్యక్తి దాడి, తీవ్ర గాయాలు

ఏఎస్సై పై వ్యక్తి దాడి, తీవ్ర గాయాలు

ఆదివారం సాయంత్రం ఒక యువకుడి కత్తి దాడిలో గాయపడిన వీరవాసరం ఏఎస్సై పార్ధ సారధి పరిస్థితి విషమంగానే వుంది.    మత్స్యపురిరోడ్డులో పొలం విషయంలో గొడవ జరుగుతుందని ఫిర్యాదు రావడంతో ఏ ఎస్ ఐ పార్థసారథి ,  హెడ్ కానిస్టేబుల్ మూర్తి తో కలిసి అక్కడికి వెళ్లారు.  అప్పటికే పొలం యజమాని అరుణ్ కుమార్, కౌలు రైతు బాబ్జి మధ్య వివాదం జరుగుతుంది . వివాదంలో కౌలు రైతు బాబ్జి పై అరుణ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎ ఎస్ ఐ పార్థసారథి పై కూడా కత్తితో దాడి చేశాడు. ఎ ఎస్ ఐ పార్థసారథి తలపై కత్తితో నరికాడు అరుణ్ కుమార్. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మూర్తి తృటిలో తప్పించుకున్నాడు.  ఏ ఎస్ ఐ పార్థసారథి, బాబ్జీపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన ఇద్దర్నీ వెంటనే భీమవరం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. దాడి చేసిన అరుణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. రక్షణ కల్పించేందుకు వెళ్లిన పోలీస్ అధికారి పై కత్తితో దాడి చేయడంతో ఈఘటన చర్చనీయాంశమైంది.

Related Posts