YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ కరువైంది - పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత శ్వేతారెడ్డి

వైసీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ కరువైంది -  పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత శ్వేతారెడ్డి

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ కరువైందని కడప టీడీపీ పార్లమెంట్  పార్టీ అధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఆరోపించారు. దిశా చట్టం తెచ్చినా కూడా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ సొంతఊరు పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపితే దిక్కులేదన్నారు. ఆ కేసును కప్పిపుచ్చే విధంగా పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. కేసును మైనర్లపై నెట్టి కేసు మాఫీ చేసే విధంగా కడప జిల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం ఉంటే.. తక్షణం జోక్యం చేసుకొని అసలు దోషులను శిక్షించాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు.

Related Posts