YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఏపీ జలదోపిడి చేస్తుంటే..కేసీఆర్‌ ఏం చేస్తున్నారు?: భట్టి

 ఏపీ జలదోపిడి చేస్తుంటే..కేసీఆర్‌ ఏం చేస్తున్నారు?: భట్టి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సంగమేశ్వరం నుంచి ఏపీ ప్రభుత్వం జలదోపిడి చేస్తుంటే.. కేసీఆర్‌ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ధరణితో రాష్ట్రంలో గందరగోళం నెలకొందన్నారు. కేసీఆర్‌ తన వాళ్ల కోసం రెవెన్యూ వ్యవస్థను ఆగం చేస్తున్నారని విమర్శించారు. సన్న వరి పండించిన రైతుల బాధలు కేసీఆర్‌కు పట్టవా? కేటీఆర్‌, హారీష్‌ మినహా మంత్రులంతా డమ్మీలేనని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ సూటుబూటు వేసుకున్నవారినే కలుస్తారని ఆరోపించారు. బీజేపీ భావోద్వేగాలతో ఓట్ల రాజకీయం చేస్తోంది.. ఇది తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్‌ ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఇన్‌చార్జ్‌కు వివరించినట్లు భట్టి తెలిపారు.

Related Posts