YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

బండి సంజయ్.. నోరు జాగ్రత్త - టీఆర్ఎస్ హెచ్చరిక

బండి సంజయ్.. నోరు జాగ్రత్త - టీఆర్ఎస్ హెచ్చరిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్  మండిపడ్డారు . కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్నారన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం నాడు విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రాజెక్టులపై.. ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారన్నారు. సీఎం కేసీఆర్  గురించి మాట్లాడే ముందు ఆచీ తూచి మాట్లాడాలని అన్నారు.   కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని, అర్ధరహితంగా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు.  మా పార్టీ నాయకత్వం, కేసీఆర్ గురించి మాట్లాడే ముందు విషయాలపై అవగహన పెంచుకొని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా రాజ్యాంగ బద్ద వ్యవస్థ లపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలని అన్నారు. బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. ప్రధాన మంత్రులతో ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై కలవడం సాధారణమని, దీన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దని సూచించారు.

Related Posts