YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కూతురుని కిడ్నాప్ చేయించిన తల్లి

కూతురుని కిడ్నాప్ చేయించిన తల్లి

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం సృష్టించిన 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంకలో సోమవారం ఉదయం 11 గంటలకు అదృశ్యమైన గుర్రాల సంయుక్త కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా చేధించారు. సోమవారం ఉదయం సంయుక్త ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారులో వచ్చి బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.దీంతో బాలిక సంయుక్త తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంయుక్త కన్న తల్లి కిడ్నాప్‌నకు పాల్పడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు జిల్లాల పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.చివరికి విజయవాడలోని ఓ ప్రవేట్ లాడ్జిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు. సంయుక్తను కన్న తల్లి వెంకటలక్ష్మి కిడ్నాప్ చేయించి తీసుకెళ్లినట్లు పోలీసులు పోలీసులు గుర్తించారు. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాలిక తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి సంయుక్త తండ్రి వద్దే ఉంటోంది. ఈ తరుణంలో బాలిక రోడ్డుపై స్నేహితురాలితో ఆడుకుంటుండగా, కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ చేయించింది సంయుక్త తల్లి వెంకటలక్ష్మి అని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు

Related Posts