YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన కార్యకర్తలు, అనుచరులు అడ్డుకున్నారు.. అతడిపై నీళ్లు పోశారు. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లుపై జోజిబాబు సంచలన ఆరోపణలు చేశారు. దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకుంటున్నారని.. వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి అన్నారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు కష్టపడి పనిచేశామని.. పార్టీకి వెన్నముకగా ఉన్న దళితుల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గంలో దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. టెండర్లను అడ్డుకుని, బిల్లులు కూడా చెల్లించవద్దని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. జగన్ గెలుపు కోసం పని‌చేసిన తమలాంటి వారు అవమానాలు ఎదుర్కొంటున్నామన్నారు. దీనిపై పార్టీ ముఖ్య నాయకులు స్పందించాలని.. లేకుంటే బాధ్యుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

Related Posts