YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి పై జగన్ కు మొండి పట్టు ఎందుకు! - టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు

అమరావతి పై జగన్ కు మొండి పట్టు ఎందుకు! - టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూసి.. అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పొట్టి శ్రీరాములు, పటేల్ చిత్రపటాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  సీఎం జగన్‌ మూడు రాజధానులంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిగా అమరావతి కోసం రైతులు, మహిళలు పోరాడుతున్నారని వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీజేపీ కూడా అమరావతికి అనుకూలమంటూ చెప్పిందని తెలిపారు. ప్రధాని మోదీ కూడా రాజధాని అమరావతికి సుముఖంగా ఉన్నపుడు సీఎం జగన్‌కు అంత పట్టుదల ఎందుకని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts