రాష్ట్ర యువజన కాంగ్రెస్ శిక్షణా తరగతులు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ యువతకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అద్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రవేటు హోటల్ నందు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ తులసిరెడ్డి , ఏ ఐ సి సి కార్యదర్సులు మెయ్యప్పన్ , క్రిస్టోఫర్ , అల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అలవారు, అల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ , రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి ,ఇంకా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేదని పార్టీ పై ఆదరాభిమానాలు అలానే ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా యువతకు మంచి అవకాశం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.