కేరళలో ఇవాళ స్థానిక ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. అయితే కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన యూడీఎఫ్ నేత ఎన్ వేణుగోపాల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఒక్క ఓటు తేడాతో పరాజయం చవిచూశారు. కొచ్చి కార్పొరేషన్లోని నార్త్ ఐలాండ్ వార్డు నుంచి వేణుగోపాల్ పోటీ చేశారు. గతంలో గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న వేణుగోపాల్కు ఈసారి ఆ నగర మేయర్ అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉండే. కానీ ఒకే ఓటుతో ఓటమి చెందడం.. ఆయన ఆశల్ని గల్లంతు చేసినట్లు అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల తాను ఓడినట్లు వేణుగోపాల్ తెలిపారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత రీకౌంటింగ్కు డిమాండ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి కొచ్చిలో యూడీఎఫ్ లీడింగ్లో ఉన్నది.