మల్కాజిగిరి బి.జే.పి కార్పోరేటర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రానున్న రోజులలో టి.ఆర్.ఎస్ కార్పోరేటర్ల అవినీతి బయటపెడ్తామని వెల్లడించారు. తాటాకు చప్పుడుకు తాను భయపడేది లేదని అన్నారు. మల్కాజిగిరి ప్రజలు ముగ్గురు బి.జే.పి కార్పోరేటర్లను ఎన్నుకున్నా కూడా ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని మల్కాజిగిరి నియోజికవర్గా బి.జే.పి కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తక్షణమే పాత కార్పోరేషన్ కౌన్సిల్ ని రద్దు చేసి కొత్త కౌన్సిల్ ఏర్పాటూ చేయాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి బి.జే.పి కార్పోరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ రానున్న రోజులలో టి.ఆర్.ఎస్ కార్పోరేటర్లు చేసిన అవినీతి వెలుగులోకి తెస్తామని , ప్రజల సమస్యల కోసం పని చేస్తుంటే టి.ఆర్.ఎస్ నాయకులు ఓర్చుకోలేక తనని చంపేప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.