YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా నుండి టీడీపీలోకి 100 మంది చేరిక

వైకాపా నుండి  టీడీపీలోకి 100 మంది చేరిక

మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామ పంచాయతీ వైకాపా నుండి సుమారు 100 మంది టిడిపి లో బుధవారం చేరారు. డెల్టా ప్రాంతాన్ని మాఫియా అడ్డాగా మార్చిన కోవూరు ద్రోహి ప్రసన్న నాయకత్వాన్ని సహించలేక వైకాపా నుండి టీడీపీలోకి  చేరికలు జరిగాయని తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ నుండి దాదాపుగా100 మంది వైకాపా నాయకులు నాయకులు,కార్యకర్తలు గోళ్ళ సుధాకర్, చిదేళ్ల కిష్టయ్య,పులి రామచంద్రయ్య  నాయకత్వంలో మాజీ శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  మరియు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్  సమక్షంలో విడవలూరు ఏరియా కోఆర్డినేటర్ చెముకుల కృష్ణ చైతన్య,మండల పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణా రెడ్డి,సీనియర్ నాయకులు పాశం శ్రీహరి రెడ్డి సహకారం తో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.


నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్  మాట్లాడుతూ ఊటుకూరు గ్రామంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  నాయకత్వం లో చంద్రబాబు  సహకారం తో 50 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు అని చెప్పారు.చేసిన మేలు మరచిపోయి గత ప్రభుత్వం లో అధికారాన్ని అనుభవించిన నాయకులు ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ మారి పోయారు,రంగస్థలం సినిమా లోని నాయకులు మాదిరి నియంతలు లా ప్రవర్తిస్తున్నారు ,వారి ఆగడాలను అంతమొందిస్తాం అని తెలిపారు.
నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  మాట్లాడుతూ  పార్టీకి అండగా నిలబడడం కోసం చంద్రబాబు నాయుడు ని తిరిగి ముఖ్యమంత్రి గా చేయడం కోసం నేడు పార్టీ లో చేరుతున్న నాయకులకు పూర్తి అండ దండలతో అందిస్తామని,హామీ ఇచ్చారు.అధికారంలోకి వస్తే నేడు చేరిన నాయకులే వూటుకూరు గ్రామ అభివృద్ధి లో వారి ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది అని భరోసా కల్పించారు.


అవసరాలు,అవకాశాలు కోసం మాత్రమే వచ్చే నాయకులను సరైన సమయంలో సరైన సమాధానం చెప్తామని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో వూటుకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. రైతులకు మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతారు,డెల్టా ప్రాంతాన్ని మాఫియా అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే ప్రసన్న కోవూరు ద్రోహిగా చిరస్థాయిగా నిలబడి పోతారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణా రెడ్డి,ఏరియా కోఆర్డినేటర్ చెముకుల కృష్ణ చైతన్య, డిస్ట్రిబ్యూషన్ కమిటీ మాజీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ సత్యం రెడ్డి,జొన్నవాడ దేవాలయం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కొడవలూరు మండలం అమరేంద్ర రెడ్డి,తెలుగు యువత అధ్యక్షలు తాతా బాలకృష్ణ, మండక ఉపాధ్యక్షుడు ఆవుల రవీంద్ర,మండల ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్,మైనారిటీ నాయకులు ఇమామ్ బాషా సీనియర్ నాయకులు దూది విజయ రాఘవన్,పాపారావు, శివశంకర్,రామచంద్రయ్య,విడవలూరు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ తాళ్ల సురేష్,జొన్నవాడ మాజీ సభ్యులు బాలా రవి, కోవూరు తెలుగు యువత అధ్యక్షుడు గౌతమ్,పడుగుపాడు అధ్యక్షుడు శ్రీనివాస్, కో మహేష్ ,నాగరాజు,వంశీ,చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts