ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎంకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. ఇవాళ సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్కు రానున్నారు.