YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సర్కార్‌కు ఎస్ఈసీ మరో ట్విస్ట్, కొత్త లాజిక్

జగన్  సర్కార్‌కు ఎస్ఈసీ మరో ట్విస్ట్, కొత్త లాజిక్

విజయవాడ, డిసెంబర్ 17 
స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్  దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషనన్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో రోజుకు 10వేల  కేసులు, ఇప్పుడు 3వేలు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌కు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేసింది.వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నాయని  ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి 3 నుంచి 6 నెలలు పడుతుందని.. ఎన్నికల వల్ల వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తోందని.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు తెలిపిందని గుర్తు చేశారు. ఇటీవలే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయని.. బీహార్,  రాజస్థాన్‌లలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పిందని అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది ఫిబ్రవరిలో ఎన్నికలు  నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు విచారణ జరుపుతోంది.. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పింది.జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండో డోస్ వేయాలని కేంద్రం సూచించిందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. దీనికి ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది 

Related Posts