YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ధర్నా - భీమడోలు

టీడీపీ ధర్నా - భీమడోలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న రాజధాని అమరావతి దీక్షలకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమడోలులో టీడీపీపార్టీ

ఏలూరుపార్లమేంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా భీమడోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ రాజధానిని కోరుతూ దీక్షలు చేస్తూ మరణించిన రైతుల నివాళులు

అర్పిస్తూ శ్రద్దాంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనంతరం నిరసనర్యాలీ చేపట్టి రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గన్ని మాట్లాడుతూ దేశంలోనే

ఒకసమస్య పరిష్కారం కోసం ఇంత పెద్దఎత్తున సంవత్సరకాలం పాటు జరిగిన దీక్షలు జరగడం అమరావతి దీక్షేనని ఇది ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని విమర్శించి రాజధాని

రైతులకు తమమద్దతు ఎప్పుడు ఉంటుందని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసి చైర్మన్ పుల్లయ్యనాయుడు, మాజీ ఎంపిపి రామతులసమ్మ,

మాజీ సర్పంచ్ శిరీష యుగంధర్, ఆదిరెడ్డి సత్తిబాబు, సనపతి అంబికా తదితరులు పాల్గొన్నారు.

Related Posts