YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతియే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని

అమరావతియే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని

 అమరావతియే ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని అని మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలియజేశారు. గురువారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామం టిడిపి సీనియర్ నాయకుడు పెద్ద తిమ్మయ్య మనుమరాలి వివాహ వేడుకలకు మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. జొన్నగిరి గ్రామంలోని ప్రజ్ఞా స్కూల్ నందు నిర్వహించిన వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాజీ కేంద్రమంత్రి మాట్లాడుతూ అమరావతియే ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని అని తెలియజేశారు.అమరావతి రైతుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తెలియజేశారు. నేటితో సరిగ్గా అమరావతి ఉద్యమానికి ఏడాది ముగిసిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,ప్రమోద్ రెడ్డి,రాతన గోవింద్ రెడ్డి మరియు మండల టిడిపి,వైస్సార్సీపీ నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Related Posts