YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగు దేశం ర్యాలీ

తెలుగు దేశం ర్యాలీ

శ్రీకాళహస్తి డిసెంబర్ 18  
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగు దేశం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్  నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా పాల్గొన్నారు. ఈసందర్భంగా   వారు మాట్లాడుతూ అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు దాదాపు 34వేల ఎకరాలు సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి ఆరోజు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి ఈరోజు ముఖ్య మంత్రి అవ్వగానే అడ్డ దుడ్డంగా అదే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులను ప్రకటన చేయడం సరికాదు ఈరోజు రైతులను రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి  ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర రాజధాని గా అమరావతే కొనసాగుతుంది అని ప్రకటన వచ్చేవరకు కూడా ఈ అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు.

Related Posts