YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సర్కార్‌కు భారీ ఊరట

జగన్ సర్కార్‌కు భారీ ఊరట

న్యూఢిల్లీ, డిసెంబర్ 18
సుప్రీం కోర్టులో జగన్ సర్కార్‌కు భారీ ఊరట లభించింది. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంశంపై విచారణలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.. హైకోర్టు ఆదేశాలు, విచారణను తప్పుబట్టింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని.. జడ్జి అలా ఎందుకు అన్నారో అర్ధం కావడం లేదన్నారు.. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలు కలవరపరిచేలా ఉన్నాయన్నారు. తదుపరి విచారణ శీతాకాల సెలవుల తరువాతకు వాయిదా వేసింది.ఏపీలో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. దీన్ని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ బోబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై యథాతథస్థితి కొనసాగించాలని సూచించింది 

Related Posts