న్యూఢిల్లీ డిసెంబర్ 18
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి 11:46 గంటలకు ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం గురుగ్రామ్కు 48 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 7.5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. డిల్లి తో పాటు సమీప ప్రాంతాల్లో ఈ ఏడాది మే నుంచి నేటి వరకు 12 సార్లు భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 12 సార్లు భూమి కంపించింది. మే 15వ తేదీన ఢిల్లీకి 13 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించగా, రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 2.2గా నమోదైంది. మే 10న 3.4గా, ఏప్రిల్ 12, 13 తేదీల్లో 3.5, 2.7గా, జూన్ నెలలో భూకంప తీవ్రత 2.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.