హైదరాబాద్ డిసెంబర్ 22,
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు మంగళవారం కలిసారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ ఇతరులు ఎన్నికల సంఘాన్ని కలిసారు. ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటు కి ఇంకా టైమ్ ఉంది అనడం అర్థరహితం. టైం ఉన్నప్పుడు ఎందుకు ముందుగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతుంది. 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వక పోతే ఎన్నికైన కార్పొరేటర్ లతో అంబెడ్కర్ విగ్రహం ముందు నిరసన చేపడతాం. రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ కి వినతి పత్రం ఇస్తామని అన్నారు.