YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయి

విపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయి

నెల్లూరు డిసెంబర్ 22, 
నెల్లూరు జిల్లాలో మంత్రి అనీల్ కుమార్ మంగళవారం  పర్యటించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ పెదప్రజలకు ఇంటి పట్టాలు  ఇద్దామని ఈ ప్రభుత్వం యోచిస్తే కొంతమంది కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. మొదటి విడతగా 15లక్షల ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందిస్తాం. 30లక్షల మందికి ఇంటి పట్టాలను అందిస్తాం. గతంలో 5ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి పక్క ఇళ్లు నిర్మిచి ప్రజలను 20 ఏళ్ల పాటు రుణం కట్టేవిధంగా చేస్తా అన్నవాళ్ళు ఇప్పుడు సిగ్గులేకుండా ఉచితంగా ఇస్తాం అంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కరూపాయికే ఇస్తా అన్నారు ఇచ్చి తీరుతామని అన్నారు.
గతంలో నిర్మించిన 300చదరపు అడుగుల ఇల్లు  4అంకణాలు మాత్రమే, మేము 6 అంకణాలు ఉచితంగా ఇస్తుంటే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఇంటి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారు. బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతమందికి అందుతున్నాయో టీడీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి అన్నారు.

Related Posts