YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రకుల్ కు కరోనా

రకుల్ కు కరోనా

హైద్రాబాద్, డిసెంబర్ 22 టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని రకుల్ తెలిపింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది.ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు, రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు

Related Posts