YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ముంబైలో సురేశ్ రైనా అరెస్ట్

ముంబైలో సురేశ్ రైనా అరెస్ట్

ముంబై, డిసెంబర్ 22 టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలోని డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో దాడులు చేసిన పోలీసులు రైనాతోపాటు సింగర్ గురు రంధవాను అరెస్ట్ చేశారు. అనంతరం వీరిద్దర్నీ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ రెయిడ్‌లో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు స్టాఫ్ సహా మొత్తం 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారనే అభియోగంతో వీరిపై కేసులు నమోదు చేశారుకోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఐపీసీ సెక్షన్లు 188, 269, 34 కింద సింగర్ గురు రంధవ, క్రికెటర్ సురేశ్ రైనా తదితరులను అరెస్ట్ చేశామని సహర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఆఫీసర్ తెలిపారు. తర్వాత వారిని బెయిల్ మీద విడుదల చేశామన్నారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ రైడ్ జరిగినట్లు తెలుస్తోంది.అనుమతి ఇచ్చిన సమయం తర్వాత కూడా డ్రాగన్‌ప్లై పబ్ తెరిచి ఉంచుతున్నారని.. కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని పోలీసులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది

Related Posts