హైదరాబాద్ డిసెంబర్ 22
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. సైబరాబాద్ పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను సజ్జనర్ ఖండించారు. బాధ్యతా కలిగిన ఎమ్మెల్యే , పొలీసులపై ఆరోపణలు చేయటం తగదు. ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసుల విధి నిర్వహణలో లొపముంటే కంప్లైట్ ఇవ్వండి. పోలీసులు సక్రమంగా డ్యూటీలు చేస్తున్నారు. అందుకే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. రాష్ట్రం, హైదారాబాద్ నగరం ప్రశాంతంగా ఉండటానికి కారణం హోమ్ గార్డు నుంచి అధికారుల వరకు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నందుకే అని గుర్తించాలని అయన అన్నారు. ఆధారాలు లేకుండా పొలీసులపై ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.