YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమర్ నాధ్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర

అమర్ నాధ్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర

మాజీ ఎంఎల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి పాదయాత్ర ద్వారా తిరుమలకి చేరుకున్నారు. 18 సంవత్సరాలుగా అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తున్నారు ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి.ఇందులో భాగంగా ఈనెల19 న అకేపాటి గ్రామం నుండి ప్రారంభమైన పాదయాత్ర మామండూరు, కుక్కలదొడ్డి మీదుగా వచ్చి అక్కడి నుండి అన్నమయ్య మార్గంలో కాలిబాటన తిరుమలకు వచ్చారు. దాదాపు ఈ పాదయాత్ర లో మూడు వేల మంది పాల్గొన్నారు. అకేపాటి తో పాటు ప్రభుత్వ విఫ్ శ్రీకాంత్ రెడ్డి కూడా వచ్చారు.గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నమయ్య ప్రశస్త్యాన్ని గుర్తించి 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేసారు..అన్నమయ్య కాలిబాట ను అభివృద్ధి విషయంపై సీయం జగన్ మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకెల్లామని ,సానుకూలంగా స్పందించారని అన్నారు అకేపాటి.

Related Posts