YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కొనసాగుతున్న చిట్ ఫండ్ బాధితులు

కొనసాగుతున్న చిట్ ఫండ్ బాధితులు

హైదరాబాద్ డిసెంబర్ 23, 
హైదరాబాద్ కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని కెకెఆర్ చిట్ ఫండ్ కంపెనీ బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  బుధవారం బాధితులు చిట్ ఫండ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తవుతున్న కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఒక డైరెక్టర్ వెంకట రమణ రావు నిన్నటి వరకు అందుబాటులో ఉన్నా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, ఇప్పుడు అతడు కూడా తప్పించుకు పోయాడని  వాపోయారు. టెక్నాలజీని ఉపయోగించి కేసులను పూర్తి చేస్తున్న తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం తమకు నెల రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని అన్నారు.  గంటల వ్యవధిలోనే ఈ కేసులను చేధిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు,  పోలీసులు ఎందుకు స్పందించటంలేదని మీడియా ముఖంగా ప్రశ్నించారు. చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్లు, ఖాతాదారుల డబ్బులతో ఆస్తులను కొనుగోలు చేసి తమను నిండా ముంచారని, వారి ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts