YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు రాబందుగా జగన్ - నారా లోకేష్

రైతు రాబందుగా జగన్ - నారా లోకేష్

విజయవాడ డిసెంబర్ 23, 
వ్యవసాయ రుణాలు అందించి, కౌలు రైతుల హక్కులు కాపాడేందుకు చట్టం తెచ్చిన రైతుబంధు చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరపడం మన ఆనవాయితీ. నాటి పాలకులు రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సంస్కరణలు తీసుకొస్తే నేడు రైతుల పాలిట రాబందుగా మారిన జగన్ రెడ్డి రైతుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు మీటర్లు బిగిస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  అయన ట్వీట్టర్ లో ప్రకటన విడుదల చేసారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వలన రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోంది. ఒకపక్క పొలంలో రైతు సాయం కోసం ఎదురుచూస్తుంటే మన వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు. కట్టేవి కూలగొట్టడం.. వీలుకాపోతే రంగులేయడం, అదీ సాధ్యం కాకపోతే స్టిక్కర్లు అంటించడం మాత్రమే తెలిసిన జగన్రెడ్డి.. చరణ్సింగ్ జయంతి రోజున జరగాల్సిన రైతు దినోత్సవాన్ని కూడా తన తండ్రి వైఎస్ జయంతికి మార్చుకున్నాడని అన్నారు.
రైతులు ఆత్మస్తైర్యంతో ఉండాలి, నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచి మీకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను మీ ముందు ఉంటాను. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా రైతన్నలకు అండగా నిలబడుతుంది, పోరాడుతుంది.  దేశ సమైక్యతకు ఆయువుపట్టుగా నిలుస్తున్న మా అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలని అయన పేర్కోన్నారు.

Related Posts