ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ కు కు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ర్యాలీ నిర్వహించి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను బిజెపి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, అర్జున్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి నాయిని సత్యనారాయణ, బిజిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఎల్ ఆర్ ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెండింగ్ లో ఉన్నా దానిని ఎందుకు అనుమతినివ్వడంతలేదని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఎల్ఆర్ఎస్ పెద్ద తల నొప్పిగా మారిందంటూ , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతున్నదని అన్నారు. పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.