YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు లో దీక్షలు

కర్నూలు లో దీక్షలు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా  టీడీపీ ధర్మపోరాట దీక్షలు విజయవంతంగా ముగిసాయి.  సిఎం చంద్రబాబు  నిరాహారదీక్ష కు మద్దతుగా జిల్లాలో మొదలైన దీక్షలలో నేతలు, కార్యకర్తలు పాల్గోన్నారు. కర్నూలు లో జరిగిన దీక్షలో డిప్యూటీ సీఎం కెయి కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్ పాల్గోన్నారు. నంద్యాల డివిజన్ లో దీక్ష చేపట్టనున్న మంత్రి భూమా అఖిల ప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి  దీక్ష బూనారు. అయా నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్చి లు దీక్షలు కొనసాగించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి, బనగానపల్లె లో ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి, ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు లో ఎమ్మెల్యే మణి గాంధి దీక్షకు దిగారు.  ఆళ్లగడ్డలో మాత్రం సీఎం క్షకు మద్దతుగా రెండు దీక్ష శిబిరాలు ఏర్పాటయ్యాయి.  మంత్రి  భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం,   ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరో దీక్ష కార్యక్రమం జరిగింది.

Related Posts