టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ను ఉద్దేశిస్తూ
వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డికి పీసీసీ ఇస్తే.. తాను పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. తనతో పాటు చాలా మంది ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని తెలిపారు. పార్టీ కోసం
పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి కూడా పనికి రారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని ఆయన మండిపడ్డారు. తాము మాత్రం జైలు చుట్టూ తిరగాలా అని
నిలదీశారు. టీడీపీలో ఉండి రేవంత్ ఆ పార్టీనే ఖతం చేశాడని... ఇప్పుడు కాంగ్రెస్ను కూడా రేవంత్రెడ్డి ఖతం చేస్తాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీని కూడా రేవంత్ మేనేజ్ చేస్తున్నాడని
మండిపడ్డారు.ప్రజల్లో రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతుంటే.. ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ ఇస్తారా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి
కింద తానుు పనిచేయనని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. పీసీసీపై ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
గ్రేటర్లో 48 సీట్లు తీసుకుని రేవంత్ ఎన్ని గెలిపించారని వీహెచ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.