YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చంద్రయాన్ డేటా 2 విడుదల

చంద్రయాన్ డేటా 2 విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 26, 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గతేడాది జులైలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి మెట్టుపై విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో విడుదల చేసింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 2019 జులై 22న ఈ ప్రయోగం నిర్వహించగా... సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలపై దిగుతూ కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో భూకేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్ క్రాస్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్, అందులోని రోవర్‌ ధ్వంసం కావడంతో ప్రయోగం విఫలమైంది.అయితే, ల్యాండర్‌ కుప్పకూలినా, చంద్రుడి ఉపరితలం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ మాత్రం అక్కడ కీలక సమాచారాన్ని ఇస్రో డేటా సెంటర్‌కు పంపుతోంది. దానితో పాటు కక్ష్యలోకి చేరిన 8 పరికరాల్లో ఏడింటి నుంచి 2019 సెప్టెంబరు - 2020 ఫిబ్రవరి మధ్యకాలం లో సేకరించిన తొలి విడత సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం ప్లానెటరీ డేటా సిస్టమ్‌-4 (పీడీఎస్‌4) ఫార్మాట్‌లో విడుదల చేసినట్లు ఇస్రో ప్రకటించింది. తమకు అందిన సమాచారం ప్రకారం అన్ని పరికరాలు సమర్ధంగా పని చేస్తున్నాయని తెలిపింది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఉప-వ్యవస్థలు సాధారణంగా ఉన్నాయని, మరో ఏడేళ్లు ఇంజిన్ పనిచేయడానికి సరిపడా ఇంధనం ఉందని వివరించింది.బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్‌ స్పేస్‌ సైన్స్‌ డాటా సెంటర్‌(ఐఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలోని pradan.issdc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష నిపుణులతో పాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడి ఉపరితలంపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.చంద్రుడి ఉపరితలంపై బిలంను ఆర్బిటర్‌లోని కెమెరా గుర్తించి, ఫోటోలు తీయగా.. దీనికి భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు విక్రమ్ సారాభాయ్‌ పేరును సూచించారు. అమెరికా అపోలో 17, రష్యా లూనా 21 మిషన్ ల్యాండింగ్ సైట్‌కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించింది. జులై 30న టీఎంసీ-2 డిజిటల్ ఎలివేషన్ మోడల్, ఆర్థో ఇమేజ్ (శాటిలైట్ ఇమేజరీ జియోమెట్రికల్ కరెక్టెడ్) ఉపయోగించి బిలంను త్రీ డైమన్షనల్‌ను రూపొందించినట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది.

Related Posts