YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

తెలంగాణ ప్రజాప్రతినిధుల్లోపై 509 మందిపై కేసులు

తెలంగాణ ప్రజాప్రతినిధుల్లోపై 509 మందిపై కేసులు

హైదరాబాద్, డిసెంబర్ 26 
తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బహిర్గం చేసింది. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులపై మొత్తం 509 కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 64 మంది శాసన సభ్యులపై 346 కేసులు ఉన్నాయని.. మరో 10 మంది ఎంపీలపై 133 కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది. మాజీ ఎమ్మెల్యేలపై 39 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది.మొత్తం ప్రజాప్రతినిధులపై 509 కేసులు నమోదై ఉండగా.. వీటిలో 245 కేసులు మాత్రమే ప్రత్యేక కోర్టుల్లోకి బదిలీ అయ్యాయని స్పష్టం చేసింది. కోర్టుల్లో పీపీలను నియమించక పోవడంతో పురోగతి లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు 73 కేస్లులో తీర్పులను మాత్రమే ఇవ్వడం జరిగిందని, కానీ ఈ 73 కేసుల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధికి గానీ శిక్ష పడిన దాఖలాలు లేవని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ప్రజాప్రతినిధులకు శిక్షలు పడకపోవడంతో పోలీసులపై అనుమానం వస్తోందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై పద్మనాభరెడ్డి గవర్నర్‌కు లేఖ కూడా రాశారు.‘‘సుప్రీంకోర్టు నేర చరిత కల ఎమ్మెల్యేలు, ఎంపీపై సత్వర విచారణకు ప్రత్యేక కోర్టును నియమించాలని అన్ని రాష్ట్రాలకు చెప్పింది. ఆ కేసులను ఒక ఏడాదిలో విచారణ జరిపి తీర్పు వచ్చేలా చూడాలని ఆదేశించింది. కానీ, ప్రత్యేక కోర్టు పని చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రభుత్వం, పోలీసులు కావాల్సిన సహాయ సహకారాలు అందించలేదు. జిల్లాల్లో మిగిలిపోయిన కేసులను ఇంకా ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీనే చేయలేదు.’’ అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. కేసుల ప్రాసిక్యూషన్‌లో పోలీసులు తగిన శ్రద్ధ వహిచడం లేదని ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Related Posts