రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్ల, బొంగుళూరులో నిబంధనలకు విరుద్ధంగా వేసవి తరగతులను నిర్వహిస్తున్న నారాయణ కళాశాలల ముందు ఏబీవీపీ నేతలు ధర్నాకు దగారు. విద్యార్థుల జీవితాలతో చేలాగాట మాడుతున్న కార్పొరేట్ కళాశాలలను మూసివేయాలని డిమాండ్ చేసారు. కాలేజీ యాజమాన్యంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు. ప్రభుత్వం వెంటనే అనుమతి లేని కళాశాలల, అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు, ఫీజుల దోపిడీ పై న్యాయ విచారణ జరిపించాలి. కార్పొరేట్ కళాశాలల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని వారు నినాదాలు చేసారు.