YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మహిళపై ఆఘాయిత్యం ఆలస్యంగా బయటపడ్డ వైనం

మహిళపై ఆఘాయిత్యం ఆలస్యంగా బయటపడ్డ వైనం

హైదరాబాద్ డిసెంబర్ 28, 
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కైతలాపూర్ సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూకట్ పల్లి సిఐ తెలిపిన వివరాల ప్రకారం విషమంగా ఉన్న మహిళను 108 వాహనంలో  ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కాగా మహిళకు మత్తు మందు ఇచ్చిన నిందితుడు రాములు తో పాటు అతని స్నేహితులు కలసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా మహిళ జననాంగాలను సైతం రక్తం వచ్చేలా గాయపరిచినట్టు తెలిసింది. ఐతే  ఈ సంఘటన రెండ్రోజుల క్రితం చోటుచేసుకోగా  మత్తులో ఉన్న బాధితురాలు  మరుసటి  రోజు సాయంత్రం రాఘవేంద్ర సొసైటీ కాలనీ లోకి ఒంటి పై బట్టలు సరిగా లేకుండా గాయాలతో  అతికష్టం మీద చేరుకున్నది . దీంతో కాలనీ వాసులు గమనించి  పోలీసులకు పిర్యాదు ఇవ్వగా 108 సహయంతో హాస్పిటల్ లో చేర్పించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న  రాములు అండ్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts