YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చిత్తూరు దీక్షలో మంత్రి అమరనాథరెడ్డి

చిత్తూరు దీక్షలో మంత్రి అమరనాథరెడ్డి

కేంద్రం నుంచి ఏపికి దక్కాల్సిన ప్రయోజనాల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  శాంతియుత, అహింస మార్గంలో పోరాటం చేస్తున్నారని  మంత్రి అమరనాథ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు  చిత్తూరులోని గాంధీ కూడలిలో సీఎం ధర్మపోరాట దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షలో అయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ  అక్కడక్కడ కొన్ని అసాంఘిక శక్తులు హింసాత్మక విధానాలను చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నందున దాన్ని అడ్డుకొని, ఈ ప్రభుత్వానికి, టిడిపికి చెడ్డపేరు తెచ్చేలా చేయాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని అయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన సమితి లో భాగమైన పలు పార్టీలు, సంఘాలు ఏపికి మోడి ప్రభుత్వం చేసిన అన్యాయం పై కర్ణాటక లో వివరించనున్నాయి. వారికి మా మద్దతు ఉంటుందని అన్నారు.  ప్రధానిగా మోడీని ఎన్నుకుంటే ఏపి ప్రజలను ఏ విధంగా మోసం చేసారో కర్ణాటక ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా మోడీ మధ్యతరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని అయన విమర్శించారు.   అహింస మార్గంలో మేం చేస్తున్న దీక్షతో కేంద్రంలో కదలిక వస్తాది.  అహింస మార్గంలో సాధించుకోవచ్చని ఎప్పుడో జాతిపిత గాంధీజీ గారు నిరూపించారని అన్నారు. 

Related Posts