YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రధానికి ఎంపీ రఘురామకృషంరాజు లేఖ

ప్రధానికి ఎంపీ రఘురామకృషంరాజు లేఖ

ఏలూరు డిసెంబరు 31,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక లేఖ రాసారు. హిందు దేవాలయాలపై దాడులు జరగకుండా కాపాడాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. 18 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతున్న  ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దేవాలయాల పై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేస్తున్నారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకుని అరెస్టు చేయడం లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైంది. తప్పుడు పనులు చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హిందువుల మనోభావాలు కాపాడేందుకు తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర కమిటీని రాష్ట్రానికి పంపి దర్యాప్తు చేపట్టాలని అని కోరారు. ముఖ్యమంత్రి జగన్ కు సెక్యులర్ భావాలు ఉంటే 48 గంటల్లో రామతీర్థంలో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే విధంగా పోలీస్ ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అయన అన్నారు.

Related Posts