YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోటి మందికి 21 వేల కోట్ల అప్పులు

కోటి మందికి 21 వేల కోట్ల అప్పులు

కర్నూలు, డిసెంబర్ 31,
యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చి వినియోగదారులను ఘోరంగా వేధింపులకు గురి చేస్తున్న వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో చైనా దేశస్థుడు లాంబోతో పాటు కర్నూలుకు చెందిన నాగరాజును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరినీ అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి.యాప్‌ల ద్వారా లాంబో 1.4 కోట్ల మందికి రూ. 21 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. దీనికి సంబంధించి బిట్‌కాయిన్ల రూపంలో నగదు విదేశాలకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. లాంబోకు చెందిన కంపెనీ కాల్‌ సెంటర్లలో కర్నూలుకు చెందిన నాగరాజుది కీలకపాత్రగా పోలీసులకు తెలిసింది. రుణ యాప్‌ల ద్వారా గత ఆరు నెలల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా లాంబో యాప్‌ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అయితే ఢిల్లీ నుంచి చైనాలోని షాంఘై వెళ్లే విమానం ఎక్కే క్రమంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్ బి.రమేశ్‌ అతడిని పట్టుకున్నారు. లాంబో, నాగరాజులను హైదరాబాద్‌ తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా, ఈ నెల 22వ తేదీన గుర్గావ్‌లోని రెండు కాల్‌సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సమాచారం తెలుసుకున్న లాంబో.. ఢిల్లీ, నోయిడాలో కొనసాగుతున్న నాలుగు కాల్‌సెంటర్లను వెంటనే మూసివేయించాడు. తర్వాత తన అనుచరుడు నాగరాజుతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. లాంబోను పట్టుకుంటే ఈ లోన్ యాప్ రాకెట్‌కు సంబంధించి విలువైన సమాచారం తెలుస్తుందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు అతడి కదలికలపై పూర్తి నిఘా ఉంచారు. ఇందులో భాగంగా ఢిల్లీలో అరెస్టయిన రమణ్‌దీప్‌ సింగ్‌, చైనా కంపెనీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ ధంగ్వాల్‌ను విచారించి లాంబో అలవాట్లు, వ్యవహారశైలి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కచ్చితమైన సమాచారంతో మంగళవారం రాత్రి నుంచి ఇన్‌స్పెక్టర్‌ రమేష్ బృందం ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉండి ఈ తెల్లవారుజామున లాంబో, నాగరాజును అరెస్ట్‌ చేసింది.లోన్ యాప్ పేరుతో అప్పులు ఇచ్చి ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్‌ అరాచకాలకు చాలా మంది బలైపోయారు. దాదాపు పది మంది వీరి ఉన్మాద చర్యలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇచ్చిన రుణం వసూలు కోసం బండ బూతులు తిడుతూ, సదరు వ్యక్తుల ఫోన్‌లోని కాంటాక్ట్‌కు సదరు వ్యక్తి మోసగాడు అని పంపుతూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ పోలీసుల సరైన చర్యలతో వీరి ఆగడాలకు అడ్డుకట్టపడింది.

Related Posts